స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ ఆడియో నిన్న విడుదలైంది.ఈ ఆడియో విడుదల కార్యక్రమంకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు అంటూ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.
చిరంజీవి 150వ సినిమాను పూరి చేయబోతున్నాడు కనుక ఆ అనుబంధంతో చిరు ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు వచ్చే అవకాశాలున్నాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే అవన్ని ఒట్టి గాలి వార్తలే అని తేలిపోయింది.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు చిరు రాలేదు.చిరు కాకున్నా కనీసం మెగా ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు కూడా రాలేదు.
ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను పూరి జగన్నాధ్ కేవలం రెండు నెలల్లో పూర్తి చేశాడు.ఈ సినిమా కథను తాను ఎప్పటి నుండో తెరకెక్కించాలని భావిస్తున్నాను అని, అయితే అది ఇప్పటికి తీరిందని పూరి చెప్పుకొచ్చాడు.
ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా కథను ఛార్మికి చెప్పడం జరిగింది.ఛార్మి మాత్రమే ఈ కథకు సూట్ అవుతుందని భావించి, ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆమెనే హీరోయిన్గా పెట్టి ఈ సినిమా చేశాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు.
ఈనెల 12న విడుదల కాబోతున్న ఈ సినిమాను సి.కళ్యాణ్తో కలిసి హీరోయిన్ ఛార్మి నిర్మించింది.ఛార్మి తొలిసారిగా నిర్మించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.