మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు.గత ఏడాది కాలంగా ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
సూపర్ హిట్ కొట్టి కూడా ఏడాది పాటు మెగాస్టార్ చిరంజీవి డేట్ల కోసం దర్శకుడు కొరటాల శివ ఎదురు చూశాడు.చిరంజీవితో సినిమా చేయాలనే పట్టుదలతో ఆయన సంవత్సరం సమయం వృదా చేసుకున్నాడు.
సైరా చిత్రం ఎట్టకేలకు పూర్తి అయిన నేపథ్యంలో కొరటాల శివ తన పనిని స్పీడ్ చేస్తున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసి పెట్టిన దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు తన సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నాడు.కాజల్, నయనతార, ఇంకా పలువురు బాలీవుడ్ సౌత్ హీరోయిన్స్ పేరు పరిశీలనకు వచ్చాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.కొరటాల శివ వీరిలో ఎవరిని ఎంపిక చేస్తాడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశ్చర్య పోయే విధంగా త్రిషతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నయనతార ప్రస్తుతం సైరా చిత్రంలో నటించిన కారణంగా ఆమెను మళ్లీ రిపీట్ చేయడం ఎందుకని, కాజల్తో ఖైదీ చిత్రంలో నటించిన కారణంగా ఆమె కూడా వద్దని కొరటాల భావించాడు.ఆ కారణంగానే ఈ చిత్రంకు త్రిషను ఎంపిక చేయడాలని నిర్ణయించుకున్నాడట.చిరంజీవి స్టాలిన్ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది.మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించబోతుంది.ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.తెలుగులో ఈ అమ్మడు సక్సెస్ దక్కించుకోక దశాబ్ద కాలం అవుతుంది.
అందుకే ఈమెను తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
.