మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా జులై లో పూర్తి అవ్వబోతుంది.ఇప్పటికే ఆచార్య సినిమా ను ముగించి విడుదల కూడా చేయాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అవుతోంది.
షూటింగ్ కేవలం వారం పది రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది.కనుక ఖచ్చితంగా సినిమా ను జులై లో పూర్తి చేస్తారనే సమాచారం అందుతోంది.
ఆచార్య ముగిసిన తర్వాత చిరంజీవి చేయడానికి వేదాలం మరియు లూసీఫర్ రీమేక్ లు సిద్దంగా ఉన్నాయి.కాని ఈ రెండు సినిమా ల్లో ఏది ముందు వస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి ఆ వెంటనే వేదాళం చేస్తాడనే వార్తలు మొదట వచ్చాయి.ఆ తర్వాత లూసీఫర్ ను ముందుకు తీసుకు వచ్చారు.
ఆ తర్వాత మళ్లీ వేదాళం అంటూ వార్తలు వస్తున్నాయి.
వేదాళం సినిమా స్క్రిప్ట్ వర్క్ అయ్యిందని ఇటీవలే దర్శకుడు మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఆయన చెబుతున్న దాని ప్రకారం సినిమా ను ఈ ఏడాదిలోనే ప్రారంభించి రెండు మూడు నెలల్లోనే పూర్తి చేస్తారట.అంటే ఈ ఏడాదిలోనే వేదాళంకు గుమ్మడి కాయ కొట్టాలని వారి ప్రయత్నం.
మరో వైపు లూసీఫర్ వర్క్ కూడా జరుగుతోంది.ఇటీవలే దర్శకుడు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేశాడు.
మోహన్ రాజా మరియు థమన్ లు కలిసి లూసీఫర్ వర్క్ లో ఉన్నామని ఫొటో కూడా షేర్ చేశారు.దాంతో ఈ రెండు సినిమా ల్లో ఏది ముందు పట్టాలు ఎక్కేను అనేది ప్రస్తుతం అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న.
చిరంజీవి ఏ సినిమాకు ముందు డేట్లు ఇస్తాడు అనేది చూడాలి.ప్రభాస్ మాదిరిగా రెండు సినిమాలను సమాంతరంగా చేస్తాడా అనేది కూడా చూడాలి.