మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్తో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు.ఆ రీమేక్ లో నటించేదుకు చిరంజీవి ఓకే చెప్పిన కారణంగానే ఆ నిర్మాత రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.
ఆ రీమేక్ బాధ్యతలను మొదట సాహో దర్శకుడు సుజీత్కు అప్పగించారు.చాలా దూరం ఆలోచించి సుజీత్కు మెగాస్టార్ బాధ్యతలను అప్పగించాడని తెలుస్తోంది.
అయితే చిరు నమ్మకంను సుజీత్ నిలుపుకోలేక పోయాడట.
సునీత్ రీమేక్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్లో అంశాలు చిరుకు నచ్చలేదట.
రెండు సార్లు మార్పులు చేర్పులు చేసి, డైలాగ్ వర్షన్ను రాయించిన తర్వాత కూడా చిరంజీవి నచ్చలేదట.దాంతో ఆ నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుండి సుజీత్ను తప్పించినట్లుగా తెలుస్తోంది.సుజీత్ ప్రస్తుతం మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు.ఈ సమయంలో లూసీఫర్ పరిస్థితి ఏంటీ అంటే నిర్మాత వద్ద సమాధానం లేదు.
వినాయక్కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలనే టాక్ వినిపించింది.కాని ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదట.
ఆచార్య చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉంది.కనుక లూసీఫర్ రీమేక్ విషయంలో ఇప్పటి నుండే హడావుడి అక్కర్లేదు అనేది చిరు మాట.ఇప్పటికే లూసీఫర్ రీమేక్ గురించి మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చాయి.కనుక ఇకపై అలాంటి ప్రచారం జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలంటూ చిరు సూచించాడట.
అయితే సైలెంట్గా మరో దర్శకుడితో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.సినిమా మొదలు అయ్యే వరకు మళ్లీ లూసీఫర్ గురించి చర్చ రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.