కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీకి చెందిన వారు నిత్యం వార్తల్లో వ్యక్తులుగా మారిపోయారు.ఏదో ఒక అంశంపై చిరంజీవి సోదరుడు నాగబాబు వార్తల్లో ఉంటూ వస్తున్నారు.
గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే బరువు బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు.దీనిలో భాగంగానే వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ ఉండడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించాల్సిన వారిని కోరుతూ, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించే పెద్దమనిషి పాత్రల్లో చిరంజీవి ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కలిసే క్రమంలో నందమూరి బాలకృష్ణ ను చిరంజీవి బృందం పిలవకపోవడం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.ఆ విషయంలో బాలయ్య చిరు బృందంపై తీవ్ర విమర్శలు చేశారు.
దీనికి కౌంటర్ గా చిరంజీవి వర్గం నుంచి నాగబాబు కౌంటర్ ఇచ్చారు.
ఈ వ్యవహారం ఇలా ఉంది అనుకుంటున్న సమయంలో చిరంజీవి వ్యవహారంపై మరోసారి నాగబాబు స్పందించారు.గతం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని వివాదాలను, సమస్యలను పరిష్కరించే పాత్రను నటుడు, దర్శకుడు దాసరి నారాయణరావు తీసుకునే వారు.ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ, పెదరాయుడు గా వ్యవహరించేవారు.
ఇప్పుడు ఆ పెదరాయుడు గా అందరూ చిరంజీవిని పిలుస్తున్నారు.ఈ విషయంపై నాగబాబు స్పందించాడు.
తన అన్నయ్య ఇండస్ట్రీకి పెద్ద రాయుడు కాదని, ఈ మధ్య ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారని, అటువంటి వ్యక్తి పరిశ్రమకు కావాలంటూ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా నాగబాబు మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీ అనేది ఏ వ్యక్తి సొత్తు కాదని, ఇక్కడ బాస్ లు ఎవరూ ఉండరని, ఎవరైనా సరే పెద్ద మనిషిగా వ్యవహరించి బాధ్యతలు పంచుకోవచ్చని నాగబాబు చెప్పారు.దాసరి నారాయణ రావు గారు పెద్దమనిషిగా బాధ్యతలను తన నెత్తిమీద వేసుకున్నారు, ఆయనకు ఓపిక, సహనం చాలా ఎక్కువ.ఆయన తర్వాత మా అన్నయ్య ముందుకు వచ్చారు.
ఎవరో ఒకరు సమస్యలను సర్దుబాటు చేయడానికి ముందుకు రావాలి.అది నాగార్జున, కృష్ణ గారు కుటుంబం కావచ్చు, నందమూరి కుటుంబం కావచ్చు, అందరూ తలా ఒక చేయి వేస్తేనే మంచిది కదా ? ఇండస్ట్రీ అంటే నాలుగు కుటుంబాలుది కాదు.ఎవరైనా రావచ్చు ఎదగవచ్చు.అప్పట్లో అన్నయ్య అలా వచ్చి ఎదిగిన వాడే.ఇప్పుడు రవితేజ, విజయ్ దేవరకొండ ఇలా ఎవరికీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా, ఎదిగారు అంటూ నాగబాబు తన మనసులోని మాటలను బయట పెట్టారు.