గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.బాలసుబ్రహ్మణ్యం కి అవార్డు రావడం పట్ల చాలా మంది ప్రముఖులు, సంగీత ప్రియులు అదే విధంగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఎస్పీ బాలు కి అవార్డు రావడం పట్ల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ఏమిటంటే.
‘నా ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలు గారుకు పద్మ విభూషణ్కు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది.అతను ఈ అవార్డుకి నిజమైన అర్హుడిగా చిరంజీవి పేర్కొన్నారు.
అయితే బ్రాకెట్స్లో మరణాంతరం అనే పదం ఉండటమే చాలా బాధను కలిగిస్తోంది’ అంటూ చిరు పోస్ట్ పెట్టడం జరిగింది.దీంతో చిరంజీవి పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.