మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఈ ఏడాది మే లో విడుదల చేయాలనుకుంటే కరోనా సెకండ్ వేవ్ అడ్డు వచ్చింది.దాంతో సినిమా ను వాయిదా వేశారు.
సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు.రెండు పాటలు మినహా షూటింగ్ ను పూర్తి చేసిన చిరంజీవి ఆచార్యను పక్కకు పెట్టి లూసీఫర్ రీమేక్ లో జాయిన్ అయ్యాడు.
మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసీఫర్ రీమేక్ కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ లో వేసిన సెట్టింగ్ లో చిత్రీకరణ చేస్తున్నారు.రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకునేలా లూసీఫర్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ ను చేస్తున్నా కూడా విడుదల విషయంలో మాత్రం ఆచార్య తర్వాతే అంటూ మేకర్స్ చెబుతున్నారు.
లూసీఫర్ రీమేక్ షూటింగ్ కు చిరంజీవి కేవలం 40 నుండి 45 రోజుల డేట్లు మాత్రమే ఇచ్చాడట.
ఆ డేట్లలోనే సినిమాను ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది.షూటింగ్ ను ముగించిన తర్వాత వెంటనే వేదాళంను మొదలు పెట్టబోతున్నారు.
వేదాళం సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత తదుపరి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.అలా మొత్తానికి లూసీఫర్ సినిమా తో పాటు వేదాలం ఆచార్య ఇలా మూడు సినిమాలు ఈ ఏడాదిలో కాకుంటే వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి.
ఆచార్య ఈ ఏడాది విడుదల సాధ్యమా అంటే కష్టమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి.కనుక చిరంజీవి ఆచార్య, లూసీఫర్ మరియు వేదాళం సినిమాలు మూడు కూడా వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ మూడు సినిమాలు కూడా చిరంజీవి స్థాయిని మరింతగా పెంచేవిగా ఉంటాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.