మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయితే లాక్డౌన్ సమయంలో తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ వాటిని లైన్లో పెట్టే పనిలో చిరు పడ్డాడు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపాడు.
కాగా ఈ సినిమాను తొలుత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి సుజీత్ తప్పుకోవడంతో ఈ రీమేక్ చిత్ర డైరెక్షన్ బాధ్యతలను మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్కు అప్పగించారు.
కాగా ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే సందేహం చిత్ర వర్గాల్లో నెలకొనడంతో, ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఓ వార్త వినిపిస్తోంది.
లూసిఫర్ రీమేక్ షూటింగ్ను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో మిగతా నటీనటుల విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా చిరంజీవి ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏదేమైనా మలయాళంలో సూపర్ సక్సెస్ కొట్టిన ‘లూసిఫర్’ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, ఈ సినిమాకు చిరంజీవి ఇమేజ్ ఎలాంటి క్రేజ్ను తీసుకొస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.