మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా తరువాత ఇద్దరు దర్శకులతో సినిమాలు చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.కాగా ఈ సినిమాకు జనవరి 21న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించేందుక చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.పూర్తి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో చిరు లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారు.కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి చూస్తున్నట్లు తెలుస్తోంది.
అటు ఆచార్య చిత్రాన్ని వేసవి బరిలో రిలీజ్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.ఇక ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరి ఆచార్య చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం వేసవి వరకు ఆగాల్సిందే.