మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టేందుకు చిరు అప్పుడే రెడీ అవుతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘లూసిఫర్’ను తెలుగులో చిరు రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసే బాధ్యతలను తొలుత యంగ్ డైరెక్టర్ సుజీత్కు అప్పగించగా, ఆయన ఇటీవల ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.
ఇక ఈ సినిమాను వివి వినాయక్ డైరక్ట్ చేస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించినా, ఇప్పుడు మరో తమిళ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ను సంక్రాంతి తరువాతే మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈలోగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చిరు సూచించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా కోసం చిరు పూర్తి మేకోవర్ చేసుకోనున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో సుహాసిని నటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా స్క్రిప్టుకు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా మార్పులు చేస్తుండటంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరి ఈ సినిమాను సంక్రాంతి తరువాత ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.