మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను తెలుగు లో మెగా స్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.తమిళ దర్శకుడు మోహన రాజా దర్శకత్వం లో ఈ సినిమా రూపొందబోతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేయడం జరిగింది.ఒరిజినల్ వర్షన్ లూసీఫర్ లో హీరోయిన్ ఉండదు.
కాని తెలుగు లో కమర్షియల్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గాను ఈ సినిమా లో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేయడం జరిగింది.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వకుండానే లూసీఫర్ రీమేక్ కు నయతారను ఎంపిక చేయడం జరిగింది.
షూటింగ్ తేదీ విషయంలో కాస్త గందరగోళం అవ్వడం వల్ల ఈ సినిమా నుండి నయన్ తప్పుకుందని చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.
ఈ సమయంలోనే త్రిషను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
త్రిష ను తెలుగు లూసీఫర్ కు ఎంపిక చేయడం పట్ల పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు లో త్రిష కు ఈమద్య పెద్ద గా క్రేజ్ లేదు అయినా కూడా ఆమె చిరంజీవికి సరి జోడీ అనే విషయంతో ఈ సినిమా కు ఆమెను ఎంపిక చేశారని అంటున్నారు.కాని తాజాగా మెగా ఫ్యామిలీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ రీమేక్ కోసం త్రిషను తీసుకున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు.
అసలు అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.తెలుగు లో లూసీఫర్ రీమేక్ చేస్తున్నాం.ఆ రీమేక్ కు నయన్ హీరోయిన్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు.దాన్ని మార్చే యోచన లేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.