మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు.కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయిన ఆ సినిమాను ఈ ఏడాదిలో పున: ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారు.ఇదే సమయంలో చిరంజీవి కొత్త సినిమా కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి మైత్రి మూవీ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడట.బాబీ చేసిన జై లవకుశ మరియు వెంకీ మామ చిత్రాలు కమర్షియల్గా పర్వాలేదు అనిపించాయి.
కనుక చిరంజీవి ఇప్పుడు ఆయనకు ఛాన్స్ ఇచ్చాడట.
లూసీఫర్ రీమేక్ను చేయాలని చిరంజీవి భావించాడట.
కాని ఆ రీమేక్కు స్క్రిప్ట్ వర్క్ సరిగ్గా చేయడంలో దర్శకుడు సుజీత్ విఫలం అయ్యాడట.దాంతో ఇప్పుడు ఆ బాధ్యతను మరో దర్శకుడికి చిరు అప్పగించాడు.
అయితే ఆ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి ముందు ఇప్పటికే రెడీగా ఉన్న బాబీ స్క్రిప్ట్కు ఓకే చెప్పడంతో పాటు డేట్లు కూడా ఇచ్చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.మైత్రి మూవీ మేకర్స్ వారు చిరంజీవితో చిత్రాన్ని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.
అందుకే వారికి బాబీ దర్శకత్వంలో మూవీని అప్పగించారట.వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.
చిరంజీవిని ఈ చిత్రంలో చాలా విభిన్నంగా చూపించబోతున్నారు.అందుకు సంబంధించిన ఫొటో షూట్ కూడా జరిగిందని అన్ని కుదిరితే చిరంజీవి బర్త్డే సందర్బంగా మైత్రి మూవీ మేకర్స్ సినిమాను అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.బాబీపై చాలా నమ్మకంతో చిరంజీవి ఈ సినిమాకు కమిట్ అయ్యాడు.మరి బాబీ ఈ చిత్రంతో చిరంజీవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.దర్శకుడు బాబీ ఇప్పటి వరకు కెరీర్లో పవర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.
జై లవకుశ మరియు వెంకీ మామలు కమర్షియల్గా పర్వాలేదు అని అనిపించుకున్నాయి.అయినా కూడా బాబీని చిరు నమ్మడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారి నమ్మకం చూసి చిరు ఈ సినిమాకు ఒప్పుకుని ఉంటాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి.