మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక వరస సినిమాలతో దూసుకెళ్తున్నారు.ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
దాదాపు 40 నిముషాల నిడివి గల పాత్రను రామ్ చరణ్ చేస్తున్నాడు.
ఈ మధ్యనే చిరంజీవి, రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కొరటాల శివ తెలిపారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డేనటిస్తున్నారు.
ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే విషయంపై కొన్ని రోజులుగా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.
అయితే చిరంజీవి రానా లేటెస్ట్ సినిమా విరాట పర్వం టీజర్ ను లాంచ్ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తుందని.అయితే ప్రస్తుతం నేను చేస్తున్న ఆచార్య సినిమా కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోందని లీక్ చేసారు.దీంతో అభిమానులకు ఆచార్య కథ తెలిసిపోయింది.
అయితే చిరంజీవి ఇంతకు ముందు కూడా ఆచార్య టైటిల్ ను ఇలానే లీక్ చేసాడు.ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మే 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది ఇలా ఉండగా చిరంజీవి ఆచార్య సినిమా పూర్తి చేసిన తర్వాత రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టాడు.లూసిఫర్, వేదాళం అనే రెండు రీమేక్ సినిమాల్లో చిరంజీవి నటించబోతున్నాడు.