టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ డమ్ సంపాదించుకుని అంచెలంచెలుగా ఎదిగి కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు ఇండస్ట్రీకి దూరమైనా చిరంజీవి రీఎంట్రీలోనూ సత్తా చాటుతున్నారు.
ఆయన నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఒక విషయంలో మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తాడని సమాచారం.చిరంజీవి రీఎంట్రీ తరువాత రీమేక్ కథలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండటం ఆయన అభిమానులను కొంత హర్ట్ చేస్తోంది.
రాజకీయాల్లోకి వెళ్లకముందు చిరంజీవి తక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాల్లో నటించారు.అయితే రీఎంట్రీలో మాత్రం ఎన్ని కథలు విన్నా ఆయనకు నచ్చలేదు.
దీంతో తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమా రీమేక్ ఖైదీ నంబర్ 150 తో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు.సినిమా హిట్టైనా ఆయన అభిమానులు మాత్రం చిరంజీవి స్ట్రెయిట్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ లో, వినాయక్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వేదాళం, లూసిఫర్ లాంటి మాస్ మసాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు తక్కువ.
మరోవైపు వినాయక్, మెహర్ రమేష్ ఫామ్ లో లేరు.మరోవైపు అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ సినిమా రీమేక్ లో కూడా చిరంజీవి నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చిరు స్ట్రెయిట్ సినిమాలను కాకుండా రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టడం ఆయన అభిమానులను హర్ట్ చేస్తోంది.చిరంజీవి నటించబోయే రీమేక్ సినిమాలు ఇప్పటికే ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది.