మెగాస్టార్ చిరంజీవి హీరోగానే కాకుండా తన అభిమానులతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటున్న విషయం తెల్సిందే.గత రెండు దశాబ్దాలుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి సహాయం చేసిన విషయం తెల్సిందే.
చిరంజీవి పేరుతో జరుగుతున్న ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన్ను దేశ సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా నిలిపింది.ఇప్పుడు చిరంజీవి మరో అరుదైన ఘట్టంకు సిద్దం అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మెగా అభిమానులు ఉన్నారు.వారంతా కూడా భీమా కిందికి వచ్చేలా చిరంజీవి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడు.మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఇన్సూర్ అయ్యేలా చేయబోతున్నాడు.అంటే తన సొంత డబ్బుతో అభిమానులకు ఇన్సురెన్స్ చేయించబోతున్నాడు.తద్వార ఎవరైనా అభిమానులు సడన్ డెత్ అయితే వారికి ఇన్సురెన్స్ వర్తిస్తుంది.బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దానికి ఉపయోగించాలని నిర్ణయించాడు.
దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం జరిగి ఉండదు అంటూ మెగా ఫ్యాన్స్ గొప్పగా చెబుతున్నారు.ప్రపంచంలో ఏ హీరో చేయని పని చిరంజీవి చేస్తున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి చెబుతున్నాడు.నిజంగా ఇది పూర్తిగా కార్యరూపం దాల్చి ఫ్యాన్స్కు ప్రమాద భీమా వర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి పేరు చిరస్మరణీయంగా నిలిచి పోవడం ఖాయం.