టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన స్టార్ స్టేటస్ ని అదే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.ఇప్పటికే ఖైది నెంబర్ 150, సైరా సినిమాలతో గ్యాప్ వచ్చిన తన మార్కెట్ తిరుగులేదని నిరూపించుకున్నారు.
ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో లూసిఫర్ సినిమాని చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో తన ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియజేశాడు.
ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు తనని తెరపై రకరకాలుగా ఆవిష్కరించారని, ఇకపై తాను యువ దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాను అని చెప్పారు.
తన సినిమాలు చూసి దర్శకులుగా ఎదిగిన వారు తనని గత సినిమాలకి భిన్నంగా కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారని, కొత్త ఆలోచనలతో కథలు సిద్ధం చేసుకొని ముందుకోస్తారని చెప్పారు.ఇందులో భాగంగా ఇప్పటికే ప్రస్తుతం టాలీవుడ్ లో స్పీడ్ గా ఉన్న యువ దర్శకులని ఇంటికి పిలిచి వారికి మంచి కథలు సిద్ధం చేయమని చెప్పడం జరిగిందని కూడా చెప్పారు.
చిరంజీవి పిలిచినా యువ దర్శకుల జాబితాలో బాబి, మెహర్ రమేష్, సుకుమార్, హరీష్ శంకర్, పరశురాంతో పాటు ఇంకా కొంత మంది ఉన్నారు.మొత్తానికి చిరంజీవి తన నెక్స్ట్ సినిమాల విషయంలో రెగ్యులర్ గా హీరోయిన్స్ తో డ్యూయెట్ లు పాడుకునే హీరోలా కాకుండా తన వయసుకి సరిపోయే పాత్రల ద్వారానే హీరోయిజం చూపించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.