ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సమంత సామ్ జామ్ షో వారంకు ఒక గెస్ట్ చొప్పున రావాల్సి ఉంది.కాని మొదటి వారంలో విజయ్ దేవరకొండ రాగా ఆ తర్వాత వారం షో కొత్త ఎపిసోడ్ రాలేదు.
విజయ్ దేవరకొండ ఎపిసోడ్ కు ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు.దాంతో సమంత తన స్టైల్ ను మార్చుకుని రెండవ ఎపిసోడ్ ను రానాతో చేసింది.
రానా మరియు నాగ్ అశ్విన్ వచ్చిన ఆ ఎపిసోడ్ కు మంచి ఆధరణ వచ్చింది.రానా హెల్త్ ఇష్యూతో పాటు అనేక విషయాలను మాట్లాడటంతో అంతా కూడా ఆసక్తి చూపించారు.
రానా మరియు నాగ్ అశ్విన్ లతో చాలా సరదాగా సమంత ముచ్చట్లు పెట్టింది.రానా ఎపిసోడ్ ఓకే కాని చిరంజీవితో సమంత చేసిన షో ఎప్పుడు వస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండవ ఎపిసోడ్ గానే చిరంజీవి ఎపిసోడ్ వస్తుందని అంతా ఆశించారు.కాని అనూహ్యంగా రానా ఎపిసోడ్ వచ్చింది.రానా ఎపిసోడ్ ఎందుకు వచ్చింది అనే విషయంపై అనేక పుకార్లు షికార్లు అయితే చేశాయి.చిరంజీవి ఎపిసోడ్ ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.
కాని నేడు మంగళ వారం.శుక్రవారంకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది.
ఈ సమయంలో ఇప్పటి వరకు ప్రోమో ఇవ్వక పోవడంతో అసలు చిరంజీవి సామ్ జామ్ షో లో చిరంజీవి ఇంటర్వ్యూ ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.చిరంజీవితో సమంత చిట్ చాట్ గురించిన ఫొటోలు మరియు వీడియోలు వచ్చాయి.
కాని టాక్ షో ను ఎందుకు స్ట్రీమింగ్ చేయడం లేదు అంటున్నారు.మాల్దీవులకు వెళ్లిన సమంత ఇటీవలే హైదరాబాద్ వచ్చింది.
ఆమె మరో గెస్ట్ తో చిట్ చాట్ చేయబోతుందట.ఈ వారం కూడా చిరంజీవి రాకపోవచ్చు అంటున్నారు.
ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి రెండు రోజుల్లో వస్తుందేమో చూడాలి.సామ్ జామ్ లో చిరు ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.