మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో చిరు మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుండో చిరు ఆలోచిస్తున్నాడు.
అయితే ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించే బాధ్యతలను దర్శకుడు మెహర్ రమేష్కు అప్పగించాడు మెగాస్టార్.దీంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకుబోయే రెమ్యునరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా కోసం చిరు ఏకంగా రూ.60 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనుండటంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్లో అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాను నిర్మాత అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యాడు.
మరి ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.మరి వేదాళం రీమేక్లో చిరు ఎలాంటి లుక్లో కనిపిస్తాడో అనేది కూడా చూడాల్సి ఉంది.