స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు ఉంది.యువహీరోలలో ఎంతోమంది హీరోలు చిరంజీవి సినిమాలను చూసి తాము నటులు కావాలని అనుకున్నామని చెబుతారు.
తాజాగా చిరంజీవి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కొడుకు రాజీవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆ తర్వాత కోటితో తనకు ఉన్న అనుబంధం గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు.
తాను కేవలం కష్టాన్ని నమ్ముకుని మాత్రమే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
కొత్త తరం కూడా ఇదే విధంగా కష్టపడి ఉన్నత స్థానాలకు రావాలని చిరంజీవి పేర్కొన్నారు.తాను ఈ స్టేజ్ కు వచ్చానంటే కోటి కూడా ఒక కారణమని చిరంజీవి అన్నారు.
సంగీత రంగంలో కోటి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడని రాజ్ కోటి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయని చిరంజీవి వెల్లడించారు.
కోటి తన ఇద్దరు కొడుకులలో ఒకరికి యాక్టింగ్ లో, మరొకరికి మ్యూజిక్ లో ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశారని చిరంజీవి పేర్కొన్నారు.
టాలెంటెడ్ యూత్ వస్తే మాత్రమే సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతుందని చిరంజీవి వెల్లడించారు.మరింత మంది యువకులు సినిమా రంగంలోకి రావాలని చిరంజీవి కోరుకోవడం గమనార్హం.కోటి మాట్లాడుతూ తనకు చిరంజీవితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదని పేర్కొన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అని కోటి తెలిపారు.తన కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండటం సంతోషంగా ఉందని కోటి తెలిపారు.ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కు చిరంజీవి, మణిశర్మతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు.