రాజకీయాలకు పులిస్టాప్ పెట్టిన తరువాత పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టిన చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో మరొక్క సారి తన స్టామినా ఏమిటో మరొక్క సారి నిరూపించారు.కుర్ర హీరోలతో సమానంగా పోటీపడి నటిస్తూ మెగాస్టార్ చిరంజీవిగా తన అసామాన్యమైన నటనతో తనకు సాటి మరెవ్వరూ లేరనే విధంగా నట విశ్వరూపం ప్రదర్శిస్తున్న చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆచార్యకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఆచార్య సినిమాతో చిరంజీవి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఆచార్య సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.దేవాదాయ శాఖ అధికారిగా ఒక పాత్రలో కనిపించనున్న చిరంజీవి, నక్సలైట్ గా మరొక పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్లు సమాచారం.
అయితే ఇక ఆచార్యలో డ్యూయల్ రోల్ పాత్రలతో వస్తుండడంతో ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎప్పుడప్పుడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్తతో ఇంకాస్త ఆత్రుత పెరిగిందని చెప్పవచ్చు.
ఏది ఏమైనా రామచరణ్, చిరు డ్యూయల్ రోల్ తో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఏది ఏమైనా ఆచార్య ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ మాత్రం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.