మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవలేదని అన్నారు చిరంజీవి.ఈ సినిమాలో బాస్ పార్టీ కోసం ఒక సెపరేట్ సెట్ వేశారు.
ఈ సెట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు పెట్టారు.ఈ పాట కోసం వారు పెట్టిన ఖర్చుపై చిరు అసంతృప్తిగా ఉన్నారు.
సినిమా గ్రాండియర్ గా రావడం కోసం ఎంత ఖర్చు అయినా వెనకడుగు వేయరు.అయితే బాస్ పార్టీ సెట్ సినిమా సాంగ్ అవుట్ పుట్ లో వావ్ అనిపించినా ఈ సెట్ గురించి తనకు ముందు చెబితే మాత్రం వద్దనేవాడినని అన్నారు చిరు.
సినిమా భారీగా తీయడం వరకు ఓకే కానీ దేనికి ఎంత పెట్టాలో అన్న క్లారిటీ ఉండాలి.డైరెక్టర్ కూడా షూటింగ్ చేసినదంతా కూడా ఉపయోగించాలని అన్నారు.
చిరు చెప్పిన దానిలో వాస్తవం ఉన్నా స్టార్ సినిమా అనేసరికి నిర్మాతలు ముందు వెనక ఆలోచించకుండా ఖర్చు చేస్తున్నారు.ఓవిధంగా ఈ ఖర్చు సినిమాకు భారీతనాన్ని తెస్తుందని చెప్పొచ్చు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.