మెగా డాటర్ నిహారిక కేవలం మూడు రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ సందర్భంగా ఆమె వివాహాన్ని రాజస్థాన్, ఉదయపూర్ కోటలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది.మూడు రోజులలో పెళ్లి జరగనుండడంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉదయపూర్ కు చేరుకున్నారు.
కేవలం కొద్దిమంది మినహా కుటుంబ సభ్యులందరూ ఉదయపూర్ చేరుకొని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలుపెట్టారు.తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా శనివారం నిహారిక పెళ్లి కూతురు పసుపు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిహారికకు పెద్ద ఎత్తున పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే డిసెంబర్ 9న రాత్రి 7 గంటల15 నిమిషాలకు నిహారిక, చైతన్య వివాహం జరగనున్న సంగతి మనకు తెలిసినదే.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఈ వివాహానికి కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు.
అంతేకాకుండా ఈ పసుపు వేడుకలో నిహారికతో పాటు తమ అక్క లైన సుస్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా తమ చిట్టి చెల్లి నిహారిక మరో ఇంటి కోడలు కాబోతోంది అంటూ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అంతేకాకుండా ఇది వేడుక సమయం అంటూ కాబోయే నిహారిక, చైతన్య దంపతులకు శ్రీజ పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీజ చేసిన ట్వీట్ కి స్పందించిన నిహారిక”లవ్యు స్వీటాక్క…” అంటూ కామెంట్ చేశారు.