మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.హీరోలుగా పలువురు ఎంట్రీ ఇచ్చారు.
ముందు ముందు మరింత మంది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.ఇక మెగా ఫ్యామిలీ నుండి లేడీస్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
నిహారిక నటిగా పలు సినిమాల్లో కనిపించింది.ఇక చిరు పెద్ద కుమార్తె సుష్మిత ఇంతకు ముందు తన తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించగా ఇప్పుడు ఆమె నిర్మాతగా మారిన విషయం తెల్సిందే.
గోల్డ్ బాక్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.
చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆమె తన వెబ్ సిరీస్ టీజర్ను విడుదల చేసింది.
ఈ వెబ్ సిరీస్ నేరస్తుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సాగుతుందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.గతంలో జరిగిన కొన్ని ఎన్ కౌంటర్లను బేస్ చేసుకుని ఈ సినిమా తీసినట్లుగా తెలుస్తోంది.
ఒక్క ఎన్ కౌంటర్ చుట్టు కథ అంతా తిరుగుతుందా లేదంటే చాలా ఎన్ కౌంటర్స్ ఇందులో చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఎన్ కౌంటర్ సీన్ చాలా క్రియేటివిటీగా దర్శకుడు ఆనంద్ రంగా చూపించాడు.
షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే టైటిల్తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ను త్వరలో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కథ విషయంలో చిరంజీవి చాలా సంతృప్తిగా ఉన్నాడట.ఆయన ఈ వెబ్ సిరీస్ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నాను అన్నాడట.
అందుకే చాలా స్పీడ్గా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.