మెగా స్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో అల్లు వారి యొక్క సహకారం చాలా ఉంటుంది అనేది చాలా మంది ఇండస్ట్రీలో చెప్పుకునే మాట.అల్లు రామలింగయ్య మరియు అల్లు అరవింద్ లు చిరంజీవి కి కెరీర్ ఆరంభం నుండి కూడా వెన్ను దన్నుగా నిలిచారు.
అల్లు అరవింద్ తన సోదరి భర్త అవ్వడం తో చిరంజీవి యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినా కూడా అల్లు అరవింద్ ఆయనతోనే ఉన్నాడు.
అయితే సినిమాల్లో రీ ఎంట్రీ తర్వాత మాత్రం చిరంజీవి మరియు అల్లు అరవింద్ కలవలేదు.చిరు 150వ సినిమా ను అల్లు అరవింద్ నిర్మించాలని అనుకున్నాడు.
కాని దాన్ని చరణ్ నిర్మించాలని పట్టుబట్టి మరీ సొంత బ్యానర్ లో నిర్మించాడు.ఆ సినిమా నిర్మాణ వ్యవహారంలో ఆర్థికంగా భాగస్వామ్యం కాకున్నా కూడా ఖచ్చితంగా అల్లు అరవింద్ ఏదో ఒక విధంగా భాగస్వామి అవుతాడు అని అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా చిరంజీవి సినిమా ల గురించి అల్లు అరవింద్ పట్టించుకోక చాలా కాలం అయ్యింది.ఇద్దరు కలిసి కనిపించింది కూడా చాలా అరుదుగానే.ఇంతకు వీరిద్దరి మద్య ఏం జరిగింది.అల్లు మరియు మెగా మద్య అంతా బాగానే ఉందా అంటే ఏమో డౌటే అన్నట్లుగా చాలా మంది సమాధానం ఇస్తున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం అల్లు అరవింద్ మరియు చిరంజీవిలు అతి త్వరలోనే పక్కా కమర్షియల్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా ఇవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నాడట.కనుక చిరంజీవి మరియు అల్లు అర్జున్ లు కలవబోతున్నారు.
తద్వారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పబోతున్నారు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.