మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, వచ్చే ఏడాదిలో వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.
పూర్తి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ సినిమా వస్తుండటంతో, ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో, ఆచార్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కలిసి కనిపించబోయే సీన్స్ ఎలా ఉండబోతున్నాయో చూసేందుకు మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పుడు మరోసారి ఈ తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో చేయాలనుకుంటున్న లూసిఫర్ రీమేక్లో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఆచార్య చిత్ర షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, లూసిఫర్ రీమేక్ను తెరకెక్కించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.కాగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు ఆచార్య చిత్రాన్ని ప్రొడ్యూ్స్ చేస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.