కరోనా మహమ్మారి విజృంభణ తరువాత థియేటర్లలో సినిమా విడుదల గురించి ప్రేక్షకుల నుంచి, థియేటర్ల యాజమాన్యాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ఉప్పెన ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
గతేడాది సమ్మర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ ఒక దశలో ఓటీటీలో విడుదలవుతుందంటూ కూడా వార్తల్లో నిలిచింది.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ఆసక్తి చూపారు.విడుదలకు ముందు చాలా ఆఫర్లు వచ్చినా ఉప్పెన ప్రొడ్యూసర్స్ మాత్రం ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ఆసక్తి చూపారు.
ఉప్పెన మూవీ నిర్మాతలలో ఒకరైన నవీన్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తమ సినిమాకు ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చాయని అయితే చిరంజీవి మాత్రం ఉప్పెన సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం కలిగేలా చేశారని అన్నారు.చిరంజీవి సూచన మేరకే ఉప్పెన మూవీని సొంతంగా విడుదల చేశామని.ఉప్పెన మూవీ విషయంలో జడ్జిమెంట్ తప్పితే భవిష్యత్తులో సినిమాల గురించి జడ్జిమెంట్ ఇవ్వనని మెగాస్టార్ ఛాలెంజ్ చేసినట్టు పేర్కొన్నారు.
ఉప్పెన సినిమా రిజల్ట్ తమకు ఎంతో సంతోషం కలిగించిందని.
చాలా ఏరియాల్లో ఈ సినిమాను సొంతంగా విడుదల చేశామని పేర్కొన్నారు.మరోవైపు ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి సినిమాతోనే ప్రయోగాత్మాక కథలో నటించి వైష్ణవ్ తేజ్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.