మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం చిరు ఆచార్య రిలీజ్ కు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ లైన్ లో పెట్టాడు.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ వస్తుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి కొన్ని డౌట్లు వచ్చాయట.
అందుకే ఈ సినిమాకు వెనక్కి నెట్టి కె.ఎస్ రవీంద్ర సినిమాను ముందుకు తెచ్చినట్టు తెలుస్తుంది.
భోళా శంకర్ సినిమా వెనక్కి తగ్గగా.కె.ఎస్ రవీంద్ర సినిమాను ముందు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట చిరంజీవి.ఆచార్య రిలీజ్ తర్వాత గాడ్ ఫాదర్ ను త్వరగా పూర్తి చేసి.
బాబీ డైరక్షన్ లో సినిమాను కూడా త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.కె.
ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు వాళ్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది.భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సినిమాలో చిరు సరసన తమన్నా నటిస్తుందని తెలుస్తుంది.