ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.మెగాస్టార్ నటించిన ”వాల్తేరు వీరయ్య” సినిమాతో సంక్రాంతి సందడి తీసుకు వచ్చాడు.
నిన్న శుక్రవారం రోజు జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.
వింటేజ్ చిరుని చూపించి మెగా ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అనేలా చేయడంతో నూరుశాతం సక్సెస్ అయ్యాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.
చాలా రోజుల తర్వాత చిరు గ్రేస్ వింటేజ్ లుక్ తో కనిపించి మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు.అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇదే అంటూ మాస్ జాతర అందించాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఇప్పుడు నెక్స్ట్ సినిమాపై చర్చ జరుగుతుంది.మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమా గురించి తాజాగా ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.మెగా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది.ఇది మాములు ఉత్సాహం కాదు.
వస్తుంది ఎవరో తెలుసు కదా.భోళా శంకర్.ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది” అని అఫిషియల్ గా చెప్పేసారు.
దీంతో ఈ న్యూస్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మరింత బూస్ట్ ఇచ్చేసింది.తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.