టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉండగా మరిన్ని అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.
ఇక చిరు సినిమాల కోసం మెగా అభిమానులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.అంతేకాకుండా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ ఓ షాకింగ్ కోరిక కోరాడు.
ఆచార్య సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు చిరంజీవి.
ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా అనుకున్నారు.
ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నాడు.ఇక ఈ సినిమాకు కూడా బోలా శంకర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు.ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాకు వీరయ్య అనే పేరు కూడా అనుకున్నారు.ఇక తాజాగా ఈ పేరును చిరంజీవి మార్చమని కోరాడట.చిరంజీవి సన్నిహితులు ఈ టైటిల్ మరీ పాతగా ఉందని అనడంతో.ఈ టైటిల్ వద్దని.కొత్త టైటిల్ చూడమని బాబీతో అన్నాడట.గతంలో ఈ సినిమా టైటిల్ అందరికీ నచ్చడంతో ఈ టైటిల్ ను చిరంజీవి పుట్టిన రోజున ప్రకటించాలని అనుకున్నారు.కానీ ప్రస్తుతం చిరంజీవికి ఈ టైటిల్ నచ్చకపోవడంతో ప్రకటించలేదని తెలిసింది.
మరి మెగాస్టార్ కోరిన ఈ కోరికకు మైత్రి మూవీస్ సంస్థ తీరుస్తుందో లేదో చూడాలి.