20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ సన్నివేశం రేపు సరిలేరు వేడుకలో కనిపించనుందా?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక రేపు జరుగబోతుంది.మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం వేడుక కోసం మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్‌గా రాబోతున్నాడు.

 Chiranjeevi And Vijayashanthi Attend The Sarileru Nikkevvaru Pree Release Funct-TeluguStop.com

వారం పది రోజులుగా ఈ విషయం మీడియాలో హోరెత్తి పోతుంది.సూపర్‌ స్టార్‌ వేడుకకు మెగాస్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు.

ఇద్దరు స్టార్స్‌ను ఒకేస్టేజ్‌ పై చూడబోతున్నందుకు చాలా ఎగ్జైట్‌ గా ఉన్నారు.అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికర కాంబో కోసం కూడా జనాలు ఎదురు చూస్తున్నారు.

Telugu Maheshbabu-

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటించిన విషయం తెల్సిందే.కనుక ఈ వేడుకలో విజయశాంతి కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.చిరంజీవి మరియు విజయశాంతిల కాంబోకు ఒక క్రేజ్‌ ఉంది.వారిద్దరు కలిసి లెక్కకు మించిన సినిమాలు చేశారు.అందులో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ చాలా ఉంటాయి.ఒకప్పుడు చాలా రొమాంటిక్‌ సినిమాలు చేసిన వీరిద్దరు ఏదో గొడవ వల్ల మళ్లీ ఎప్పుడు మాట్లాడుకోలేదు.

ఇన్నాళ్లకు విజయశాంతి మరియు చిరంజీవి ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారు.

Telugu Maheshbabu-

రాజకీయంగా ఉన్న సమయంలో చిరంజీవి మరియు విజయశాంతిలు వైరి పార్టీల్లో ఉన్నారు.అప్పుడు ఇద్దరి మద్య మాట్లాడుకునే సందర్బం రాలేదు.కాని ఇప్పుడు ఇద్దరు సినిమాల్లో ఉన్నారు కనుక మాట్లాడుకుంటారా, ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారా అనే చర్చ అందరిలో వస్తుంది.

అసలు ఈ వేడుకకు చిరంజీవి వస్తున్న కారణంగా విజయశాంతి వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి రేపు జరుగబోతున్న సరిలేరు నీకెవ్వరు వేడుకలో వీరిద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube