మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యి నెలలు గడుస్తోంది.కరోనా వల్ల గత ఏడాది విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.
ఈ ఏడాది మే లో విడుదల చేయాలని మరో సారి ప్రయత్నించినా కూడా కరోనా సెకండ్ వేవ్ అది సాధ్యం కానివ్వలేదు.ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా లో చరణ్ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.చిరు మరియు చరణ్ లు కలిసి నటించిన సినిమా అవ్వడం వల్ల హైప్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకంతో ఉన్నారు.ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు కొరటాల శివ సిద్దం అవుతున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ చివరి నుండే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారట.ఈ విషయమై ఎలాంటి మార్పు లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. జనవరి లో సంక్రాంతి కానుకగా ఆచార్య ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.పబ్లిసిటీ విషయంలో కొత్త పుంతలు తొక్కించి ఆచార్య హైప్ మరింతగా పెంచాలని భావిస్తున్నారు.ఈ సినిమా లో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
ఈ సినిమా కోసం కొరటాల శివ వేయించిన ఒక గుడి సెట్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ లు ఈ సినిమాలో నక్సలైట్ లుగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.