ఈ సంక్రాంతికి పోటీ రసవత్తరంగా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కి రాబోతున్న విషయం తెలిసిందే.
బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.
శృతి హాసన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక సంక్రాంతి కి రాబోతున్న మరో సినిమా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి.
ఈ సినిమా కు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాలను కూడా నిర్మించేది మైత్రి మూవీ మేకర్స్ మరియు హీరోయిన్స్ శృతి హాసన్.కనుక సంక్రాంతికి రెండు సినిమాలు సక్సెస్ అయితే ఒకే సంక్రాంతికి రెండో బ్లాక్ బస్టర్లు దక్కించుకున్న నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిలవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇదే సమయం లో సంక్రాంతి కి రెండు సినిమా లు సక్సెస్ అయితే శృతి హాసన్ కూడా అరుదైన రికార్డు దక్కే అవకాశం ఉంది.
ఒకే సారి ఇద్దరు స్టార్ హీరో లతో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు రెండు సినిమాలు కూడా సక్సెస్ దక్కించుకుని రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు అయితే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నట్లు అవుతుంది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.చిరంజీవి మరియు బాలకృష్ణ లతో సినిమా అంటే కచ్చితంగా ఆమె కు పాజిటివ్ టాక్ తెచ్చిపెడుతుంది.
కనుక ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత శృతి హాసన్ కి వరుసగా సినిమాల్లో ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.