మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా చిరంజీవి ఓకే చెబుతున్నారు.
అయితే చిరంజీవి అల్లు శిరీష్ కలిసి ఒకే సినిమాలో నటించారని చాలామందికి తెలియదు.తాజాగా చిరంజీవి, తాను కలిసి ఒకే సినిమాలో నటించామని వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి హిందీలో హీరోగా తెరకెక్కిన ప్రతిబంధ్ మూవీలో తాను నటించానని శిరీష్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా చేసే సమయంలో తన వయస్సు కేవలం 3 సంవత్సరాలు అని శిరీష్ వెల్లడించారు.
చిరంజీవి నటించిన సినిమాలలో చాలా సినిమాలు తనకు ఇష్టమని శిరీష్ కామెంట్లు చేశారు.మరోవైపు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.
ఊర్వశివో రాక్షసివో హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనా ఆ రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.
శిరీష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోకపోవడం ఆయన అభిమానులను హర్ట్ చేసింది.
అల్లు శిరీష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.అల్లు శిరీష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నారు.అయితే అన్నీ ఉన్నా అల్లు శిరీష్ కు అదృష్టం కలిసిరావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సినిమాసినిమాకు శిరీష్ రేంజ్ పెరిగే దిశగా అల్లు అరవింద్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.అల్లు శిరీష్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి అల్లు శిరీష్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.
బన్నీ శిరీష్ కలిసి నటించాలని కొంతమంది నెట్జన్లు సూచిస్తున్నారు.ప్రతిబంధ్ మూవీకి శిరీష్ కేవలం 100 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.