చిరంజీవి, అల్లు అరవింద్లు చాలా క్లోజ్గా ఉండేవారు.వారిద్దరు బందువులుగా మాత్రమే కాకుండా మంచి స్నేహితులుగా కూడా ఉండేవారు.
గతంలో అల్లు అరవింద్ బ్యానర్లో చిరంజీవి పలు సినిమాలు చేశారు.ఇద్దరు కలిసి పలు ప్రాజెక్ట్లు బిజినెస్లు నిర్వహించారు.
అంతటి అనుబంధం ఇద్దరి మద్య ఉండగా ఇప్పుడు వారిద్దరు విడిపోయారు, గొడవలు అంటూ పుకార్లు పుట్టుకు వచ్చాయి.దాంతో తాజాగా చిరంజీవి ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
అల్లు అరవింద్ ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి గొడవలు అంటూ వార్తలు వస్తున్నాయి.మా ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా అందులో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా ఉంటుంది.అందులో ఎలాంటి అనుమానం ఉండదు.ఎటువంటి వివాదాలు విభేదాలు మా మద్య ఉండవు.మేమంతా కూడా ఒకే కుటుంబ.మా మద్య దాపరికాలు, దూరాలు అసలు లేవని చిరు పేర్కొన్నాడు.మీడియాలో వస్తున్న వార్తలన్ని కూడా పుకార్లే అని కొందరు కావాలని పుట్టిస్తున్న ఈ వార్తలు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.
గతంలో పవన్కు నాకు విభేదాలు అన్నారు.మేమిద్దరం మాట్లాడుకోవడం లేదని చెప్పారు.
కాని ఇప్పుడు ఎవరు కూడా పవన్ హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్తాడని మాట్లాడుకోవడం లేదని చిరంజీవి గత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.మొత్తానికి చిరంజీవి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఇలా క్లారిటీ ఇచ్చాడు.