సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఆచార్యపై అంచనాలు తారాస్థాయిలో క్రియేట్ అయ్యాయి.
పూర్తి సోషల్ మెసేజ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమా తరువాత చిరు ఓ మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మలయాళంలో మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ను రామ్ చరణ్ సొంతం చేసుకోగా, తెలుగులో చిరంజీవి లీడ్ రోల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను సాహో వంటి బిగ్ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా కథలో మార్పులు, చేర్పులు చేయాలని సుజీత్ను చిరు కోరాడట.
ఇక స్క్రిప్టులో మార్పులు చేస్తున్న సుజీత్, ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ను భారీగా చూపించనున్నాడట.చిరు ఇమేజ్ను ఈ ఎలివేషన్స్ పీక్స్కు తీసుకెళ్లనున్నాయని తెలుస్తోంది.
చిరు తనదైన స్టయిల్లో ఈ ఎలివేషన్స్ సీన్స్లో కనిపిస్తాడట.ఈ సీన్స్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ట్రీట్ అందుకుంటారట.
మరి ఈ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాటిలో చిరు ఎలా మెరుస్తారనే అంశాలు ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.