మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నుండి నేడు మొదటి పాట వచ్చేస్తోంది.ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే వచ్చేసింది.
ఆ ప్రోమో పై ట్రోల్స్ వస్తున్నాయి.ఈ సినిమా కు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే.
ఆయన ఎక్కువ సినిమా లకు ఒకే తరహా సంగీతాన్ని అందిస్తాడని అంతా అంటూ ఉంటారు.తన ట్యూన్స్ ను తానే కాపీ కొడుతూ కొత్తగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని అంటారు.
ఇప్పుడు ఆచార్య సినిమా లోని లాహే లాహే పాట కూడా గతంలో వచ్చిన ఇంద్ర సినిమా లోని భం భం భోలే పాట లోని మ్యూజిక్ మాదిరిగా ఉందని అంటున్నారు.పాట పూర్తిగా రాకుండానే చాలా మంది అప్పుడే ట్రోల్స్ చేస్తున్నారు.
అది ఇది సేమ్ ఉంది అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.
కొరటాల గత సినిమాలన్నింటికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.ఆ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
పాటలు కూడా అబ్బురపర్చే విధంగా ఉన్నాయి.ఇప్పుడు ఆచార్య కోసం మాత్రం చిరంజీవి కోరాడు అనే ఉద్దేశ్యంతో మణిశర్మ తో వర్క్ చేయడం జరిగింది.
మొదటి పాట విడుదల సమయంలోనే విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొరటాల శివ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.కొరటాల శివకు సంగీతం విషయంలో స్వేచ్చను ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మొత్తానికి లాహే లాహే పాట లో చిరంజీవి స్టెప్పులు అదిరి పోయేలా ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా కాపీ మరక అంటడంతో ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.