కరోనా కారణంగా గత ఐదు ఆరు నెలలుగా షూటింగులు పూర్తిగా నిలిచిపోయాయి.సినిమా షూటింగులు ఎక్కడ కూడా జరగలేదు.
ఎట్టకేలకు గత నెల నుండి షూటింగులో పునః ప్రారంభమైన విషయం తెలిసిందే.మొదట చిన్న హీరోలు సెట్స్ పైకి వెళ్లగా గత కొన్ని రోజుల నుండి పెద్ద హీరోలు కూడా సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
మొదటగా నాగార్జున కెమెరా ముందుకి వెళ్ళాడు.ఆ తర్వాత ఒక్కరొక్కరుగా సినిమా షూటింగ్ లకు హాజరవుతున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటూ అంతా భావించారు.
కానీ గుట్టు చప్పుడు కాకుండా చాలా తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ తో సింపుల్ గా సినిమాను పునః ప్రారంభం చేసినట్లుగా సమాచారం అందుతోంది.చిరంజీవి జాయినింగ్ కి వారం పది రోజుల ముందు నుండే కొరటాల శివ దర్శకత్వంలో కీలక నటీనటుల షూటింగు ప్రారంభం అయింది.
ఆ తర్వాత చిరంజీవి కూడా షూట్ లో జాయిన్ అయ్యారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్ రెండు రోజులు వర్షాల కారణంగా నిలిచిపోయింది.
మళ్లీ నేడు షూటింగ్ ప్రారంభమైనట్లు గా తెలుస్తోంది.జనవరి లేదా ఫిబ్రవరిలో వరకు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ గా ఉన్నాడు.
సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆచార్యను రెడీ చేస్తున్నారు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు విషయం తెలిసిందే.
ఆయన డిసెంబర్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే ఆమె వచ్చే నెలలో షూటింగ్ లో జాయిన్ అవ్వనుంది.
మొత్తానికి చిరంజీవి సినిమా షూటింగ్ ప్రారంభమైన నేపధ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే షూటింగ్ ప్రారంభమైన విషయంపై యూనిట్ సభ్యులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.