టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా గాఆచార్యతెరకెక్కుతుంది.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కి స్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.
ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.
రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు పాటలను షూట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు 20 నుండి 25 వరకు ఒక సాంగ్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ పాటలో చిరంజీవి, రామ్ చరణ్, పూజ హెగ్డే పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.మరొక పాటను ఆగస్టు 26 నుండి స్టార్ట్ చేసి నెలాఖరుకి కంప్లీట్ చేయాలనీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట.దీంతో ఆగస్టు నెలలోనే ఆచార్య షూట్ మొత్తం కంప్లీట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది.
షూటింగ్ పూర్తి చేసిన తర్వాత విడుదల పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడు.చిరంజీవి ఈ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలను చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.
వీటితో పాటు బాబీ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు.మరి చూడాలి చిరంజీవి ఈ మూడు సినిమాల్లో ఏది ముందు సెట్స్ మీదకు తీసుకు వేళ్తాడో.