మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఆగస్టు లో విడుదల అయ్యేది.కానీ కరోనా కారణంగా సినిమా అసలు ఈ ఏడాది విడుదల అయ్యేదే కష్టం అయ్యింది.
చిరంజీవి ఈ ఏడాది ఆచార్య సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి వచ్చే ఏడాది రెండు సినిమాలు చేయాలని భావించారు.అందుకు చాలా కసరత్తు చేశారు.
చిరంజీవి వయసు మీద పడుతున్న కారంగా అతి తక్కువ సమయంలో ఎక్కువగా సినిమాలు చేయాలని మాస్టర్ ప్లాన్ చేసుకున్నాడు.కానీ అది అంతా కూడా తలకిందులు అయ్యింది.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తర్వాత లూసీఫర్ సినిమా చేయాలని భావిస్తున్నాడు.కానీ అది ఎప్పటికి సెట్స్ పైకి వెళ్ళేది చెప్పలేని పరిస్థితి.
లూసీఫర్ సినిమా మాత్రమే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చిరు చేయాల్సి ఉంది.కానీ ఈ కరోనా కారణంగా చిరంజీవి సినిమాలు అన్ని కూడా తారుమారు అయ్యాయి.రెండు సినిమాలు వచ్చే ఏడాది చేయాలనుకుంటే కనీసం ఆచార్య సినిమా కు కూడా దిక్కు లేదని మెగా వర్గాల వారు అంటున్నారు.ఇది మెగా ఫ్యాన్స్ కు పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు