మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152వ చిత్రం ఆచార్యను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతోంది.
ఆగస్టులో చిరంజీవి 152వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక చిరంజీవి 153వ సినిమా ఇప్పటికే దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
మయాళ హిట్ మూవీ లూసీఫర్ను చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
లూసీఫర్ రీమేక్కు డైరెక్టర్ ఎవరు అనే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.సుజీత్ పేరును ఎక్కువగా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇదే సమయంలో చిరంజీవి 154వ చిత్రం గురించి కూడా వార్తలు వస్తున్నాయి.వరుసగా చిత్రాలు చేయాలనే ఉద్దేశ్యంతో 154 చిత్రానికి కూడా చిరు అప్పుడే కమిట్ అయ్యాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ మరియు రామ్ చరణ్లు మెగా 154ను నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమాకు రెడీ అవుతున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయబోతున్నాడు.ఎన్టీఆర్తో సినిమా పూర్తి అయ్యి విడుదల కాకముందే చిరంజీవి మూవీ షూటింగ్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయినా కూడా వచ్చే ఏడాది దసరాకు చిరంజీవి, త్రివిక్రమ్ల మూవీ రావడం కన్ఫర్మ్ అంటూ మెగా కాంపౌండ్ నుండి గట్టి వాదన వినిపిస్తుంది.