మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి విడుదలకు ముందు తదుపరి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్ పోషించబోతున్నాడు.
భారీ అంచనాలున్న ఆ చిత్రం కోసం రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసి వెయిట్ చేస్తున్నాడు.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రంతో పాటు, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్సింగ్’ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ శృతిహాసన్ ఇప్పుడు చిరంజీవి 152వ చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.బాబాయి, అబ్బాయిలతో నటించిన హీరోయిన్ ఇప్పుడు తండ్రి చిరంజీవితో నటించడం సినీ ఇండస్ట్రీలోనే రికార్డు అంటూ చెబుతున్నారు.అద్బుతమైన ఈ కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.
శృతిహాసన్ హీరోయిన్గా ఎంపిక చేసిన విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు.మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్లు మంచి స్నేహితులు.అలాంటి నేపథ్యంలో కమల్ హాసన్ కూతురుతో నటించడం ఏమాత్రం సరికాదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.మే లేదా జూన్లో చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ప్రారంభం కాబోతుంది.అప్పటి వరకు హీరోయిన్ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.