గత రెండు మూడు రోజులుగా చిరంజీవి 152వ చిత్రంలో మోహన్బాబు విలన్ పాత్రను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ని మీడియాల్లో కూడా ఈ వార్త చాలా ప్రముఖంగా వస్తుండటంతో జనాల్లో ఆసక్తి కనిపిస్తుంది.
చాలా సంవత్సరాల క్రితం వీరిద్దరు కలిసి ఎన్నో మంచి సినిమాలు చేశారు.వీరిద్దరి జోడీ అప్పట్లో ఆకట్టుకునేది.
అందుకే ఇప్పుడు మళ్లీ వీరు కలిసి నటిస్తే చూడాలనుకుంటున్నాం అనుకున్న వారికి ఆ వార్త చాలా సంతోషాన్ని కలిగించింది.కాని ఆ వార్త నూటికి రెండువందల పాళ్లు నిజం కాదంటూ మెగా కాంపౌండ్ ప్రకటించింది.
చిరంజీవి 152వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్గా ఇప్పటికే ప్రముఖ నటుడు ఎంపిక అయ్యాడు.
మళ్లీ కొత్తగా విలన్ను తీసుకోవాల్సిన అవసరం లేదు.అయినా ఇప్పటి వరకు ఇతర పాత్ర కోసం అయినా మోహన్బాబును కొరటాల శివ సంప్రదించింది లేదు.
రామ్ చరణ్ కూడా మోహన్బాబుతో చర్చలు జరిపింది లేదు అంటూ మెగా సన్నిహితులు చెబుతున్నారు.
చిరంజీవి మరియు మోహన్బాబుల మద్య వివాదం తొలగిపోయింది.అయితే అది అంత సులభంగా సినిమాల్లో అప్పుడే నటించేంతగా తొలగి పోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి, మోహన్ బాబుల కాంబోలో సినిమాను ఆశించడం అది అత్యాశ అవుతుందని మెగా కాంపౌండ్కు చెందిన వారు అంటున్నారు.
మోహన్బాబు గతంలో చేసిన విమర్శలు మరియు వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీ మర్చి పోదు.అలాంటిది ఆయనతో చిరంజీవి ఎలా నటిస్తాడంటూ మెగా సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.