మెగాస్టార్ చిరంజీవి 150వ ఖైదీ నెం.150 సినిమా విడుదల అయ్యి నేటికి 5 ఏళ్లు అయ్యింది.ఆ సినిమా తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు.చిరంజీవి రీ ఎంట్రీ అంటూ ప్రచారం జరిగిన తర్వాత అయిదు ఏళ్లకు గాని ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
అంటే ఈ మొత్తం పదేళ్లలో ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఆయన నుండి వచ్చిన సినిమాలు మాత్రం రెండే రెండు.అవి ఖైదీ నెం.150 మరియు సైరా నరసింహా రెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా ఆయన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పాయి.
అద్బుతమైన వసూళ్లను దక్కించుకున్న ఆ సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేయాలని చిరంజీవి అనుకున్నారు.కాని ఆయన అనుకున్నది సాధ్యం కాలేదు.ఎందుకంటే ఆయన సినిమాలు ఏవీ కూడా ఈ మద్య కాలంలో విడుదల కాలేదు.
కారణం షూటింగ్ ఆలస్యం అవ్వడం ఒక కారణం కాగా మరోటి కరోనా.ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది కాని ఇప్పటి వరకు ఆయన విడుదల చేయలేక పోతున్నాడు.2020 ఆగస్టు లో విడుదల అవ్వాల్సిన ఆచార్య ఇప్పటికి విడుదల కాలేదు.కాని పరిస్థితులు అనుకూలిస్తే ఆచార్య మాత్రమే కాకుండా గాడ్ ఫాదర్, భోళా శంకర్, ఏల్తేరు వాసు మరియు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు చిరంజీవి తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.
మొత్తంగా చిరంజీవి సినిమాలు రావడం లేదు అని బాధ పడుతున్న వారికి రాబోయే రెండేళ్లు ఖచ్చితంగా పండుగ ను తీసుకు రాబోతున్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఖైదీ విడుదల అయ్యి అయిదు ఏళ్లు అయ్యింది.ఆ తర్వాత ఒకే ఒక్క సైరా విడుదల అయ్యింది.
ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు వరుస సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.