కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు అన్ని కూడా దాదాపుగా రద్దు అయ్యాయి.మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ను ముగించాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది.
రామ్ చరణ్ మరియు సోనూసూద్ లతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు ఉండగా కరోనా వల్ల నిలిచి పోయింది.చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు.
షూటింగ్ లతో బ్రేక్ తీసుకున్నా కూడా సినిమా వర్క్ కు మాత్రం ఆయన బ్రేక్ తీసుకోలేదు.ఆచార్య తర్వాత చేయాల్సిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.
వేదాళం సినిమా ను ఇప్పటికే చిరంజీవి కన్ఫర్మ్ చేశాడు.మలయాళ సూపర్ హిట్ మూవీ వేదాళం ను పూర్తిగా మార్చేస్తున్నారు.
తెలుగులో కమర్షియల్ మూవీ గా వేదాళం ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.అందుకోసం పలువురు దర్శకులు మరియు రచయితలు ఈ కథపై వర్క్ చేస్తున్నారు.
దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్దం చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ స్క్రిప్ట్ కు తన వంతు మార్పులు చేర్పులు సూచిస్తున్నాడు. లూసీఫర్ సినిమా పై చిరంజీవి చాలా ఆసక్తిగా ఉన్నారు.
మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటించాలని అప్పుడే అనుకున్నాడు.ఆ సినిమా వచ్చిన సమయంలోనే వెంటనే రీమేక్ కు సంబంధించిన రైట్స్ ను తీసుకున్నారు.
ఈ రీమేక్ ను తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం లో చిరంజీవి చేస్తున్న విషయం తెల్సిందే.అన్ని అనుకున్నట్లుగా జరిగితే లూసీఫర్ ను ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకున్నారు.
కాని కరోనా మెగా లూసీఫర్ ను ఈ ఏడాది లో రాచ్చేది లేదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.