తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియామకం అయ్యారు.ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చింతా ప్రభాకర్ అన్నారు.రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్ధికి పాటు పడతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.