సింగర్ చిన్మయి (Chinmayi) రచయిత వైరముత్తు (Vairumuthu) మద్య ఎలాంటి వివాదం చెలరేగిందో మనకు తెలిసిందే.అయితే ఈ వివాదం ఇంకా సద్దుమనగ లేదని తెలుస్తోంది.
తనకు అవకాశం దొరికిన ప్రతిసారి చిన్మయి వైరముత్తుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.వైరముత్తు అనేక మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది.
అయితే తాజాగా మరోసారి ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ సింగర్ చిన్మయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Tamilanadu Cm Stalin) విన్నవించుకున్నారు.బ్రిజ్ భూషణ్(Briz Bushan) తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్ తోపాటు ఒక మైనర్ సైతం వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇతను పై చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెళ్లి వెతుతున్నాయి.ఇక ఈ విషయంపై నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) కూడా స్పందించడంతో చిన్మయి కమల్ హాసన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అయితే తాజాగా ఈ విషయంపై ఈమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా చిన్మయి ట్వీట్ చేస్తూ బ్రిజ్ భూషణ్కైనా, వైరముత్తుకైనా రూల్స్ ఒకేలా ఉండాలి.
ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరోలా ఉండకూడదని తెలిపారు.
వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17మంది మహిళలు బహిరంగంగానే వెల్లడంచాం.దాంతో ఆ వ్యక్తి మా కెరీర్ను నాశనం చేశాడు. మాకు ఉన్న కళతో పోలిస్తే తనకు ఉన్న టాలెంట్ పెద్ద గొప్పేమీ కాదు.
దయచేసి వైరు ముత్తు లాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ముఖ్యమంత్రిని కోరుతూ ట్వీట్ చేశారు.ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే తమిళనాడులో కొన్ని పని ప్రదేశాలు చాలా సేఫ్ గా ఉంటాయని చిన్మయి పేర్కొన్నారు.
ఇలా వైరు ముత్తుపట్ల చర్యలు తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రిని కోరుతూ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.