సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి ఎప్పుడైతే మీటూ అంటూ వైరముత్తుపై కామెంట్స్ చేసిందో అప్పటి నుండి ఆమె కెరీర్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది.సోషల్ మీడియా పరంగా ఆమెకు భారీ మద్దతు అయితే దక్కింది.
కాని ఇండస్ట్రీలో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.గతంతో పోల్చితే ఈ అమ్మడి ఆఫర్లు చాలా తక్కువ అయ్యాయి.
ఆమె ఏం చేసినా కూడా అడ్డుకునే వారు ఎక్కువ అయ్యారు.ఆమెను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి కూడా తొలగించారు.
కోర్టుకు వెళ్లి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్లో కొనసాగుతున్న చిన్మయి న్యాయ పోరాటంను కంటిన్యూ చేస్తూనే ఉంది.ఇదే సమయంలో డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాజాగా ఈమె నామినేషన్ దాఖలు చేసింది.
అయితే చిన్మయికి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్లో అసలు ఓటు లేదు.అలాంటప్పుడు ఆమె నామినేషన్ ఎలా వేస్తుంది అంటూ ప్రత్యర్థి వర్గంకు చెందిన రాధ రవి ఆరోపించాడు.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వారు ఆమె నామినేషన్ను తిరష్కరించారు.
చిన్మయి ఆ ఎన్నికల్లో గెలిచి తన సభ్యత్వంపై ఉన్న వివాదాన్ని తొలగించుకోవాలని ఆశ పడిరది.కాని ఆమెకు దారుణంగా పరాభవం తప్పలేదు.చిన్మయి అసలు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా అర్హురాలు కాదంటూ ఎన్నికల అధికారి చెప్పుకొచ్చారు.
కోర్టు ఉత్వర్వుల కారణంగా ఆమె డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ తాత్కాలిక సభ్యత్వంతో కొనసాగుతుందని, కోర్టు తుది తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తే తప్ప ఆమె ఓటు వేసేందుకు అర్హురాలు కాదని వారు అంటున్నారు.మొత్తానికి ఎన్నికల అధికారి కూడా చిన్మయికి హ్యాండ్ ఇచ్చాడంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.