ఇప్పటికీ స్త్రీలకు ధైర్యం అనేది ఏదో ఒక సమయంలో వస్తుంది.కానీ కొన్ని విషయాలలో అమ్మాయి లైన, స్త్రీలైన కొన్ని ఘటన లను ఎదుర్కోక తప్పదు.
కొంతమంది తమ బలం తో, ధైర్యంతో ఎదుర్కొంటారు.ఇలా ఇలా ప్రతి ఒక్క స్త్రీ కు ఏదో ఒక సంఘటన ఎదురైనప్పుడు మాత్రమే వాళ్లలో ఉన్న ధైర్యం బయటపడుతుంది.ఇదిలా ఉంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియ రమణి అనే జర్నలిస్టు ఎం జే అక్బర్ పై చేసిన ఆరోపణల గురించి తాజాగా చిన్మయి హర్షం వ్యక్తం చేసింది. 2018లో కేంద్ర మాజీ మంత్రి ఎం జే అక్బర్ తను ఓ పత్రికకు ఎడిటర్ గా చేస్తున్న సమయంలో ప్రియా రమణి అనే జర్నలిస్టు ను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపణలు చేసింది.అంతేకాకుండా ఆమె చేసిన ఆరోపణల వల్లే మరో 20 మంది మహిళలు బయటకు వచ్చారు.దీంతో అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.తనను అలా చేసినందుకు ఆమెపై పరువునష్టం కేసును వేశాడు.
ఈ విధంగా తాజాగా ఈ కేసు పై తీర్పు రావడంతో ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణి ను నిర్దోషిగా ప్రకటించింది.
ఇక తను నిర్దోషిగా తేలిన సందర్భంగా మహిళలు, స్త్రీవాదులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.అంతేకాకుండా చిన్మయి కూడా ఈ ఓ వీడియోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.
ప్రియా రమణి కేసు ద్వారా అందులో వచ్చిన తీర్పు కు ఆమెకు న్యాయం కలిగిందని, అంతే కాకుండా ఇంకా న్యాయం బతికే ఉందని తెలిపింది.నిజం ఎప్పటికైనా దాగకుండా గెలుస్తుందని చిన్మయి తెలుపుతూ భావోద్వేగానికి గురైంది.
ఇప్పటికైనా రాధారవి, వైరముత్తు లను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే కళ్ళు తెరవండని, వాడిని సపోర్ట్ చేస్తున్న బిజెపీ, లెఫ్ట్, రైట్ సెంటర్ వింగ్ లు ఇకనైనా మారండి అంటూ తెలిపింది.ఈ తీర్పు వల్ల ఎంతోమంది స్త్రీలకు, తనకు కూడా ధైర్యం నింపిందంటూ తెలిపింది.