ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్ వద్ద నిబంధనలు అతిక్రమించినందుకు గాను చైనా జాతీయురాలికి కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది మార్చి 30న షాంఘైకు చెందిన 33 ఏళ్ల వ్యాపారవేత్త యుజింగ్ జాంగ్ ట్రంప్ రిసార్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతోంది.
దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆ సమయంలో ఆమె వద్ద మాల్వేర్ ఉన్నట్లు అనుమానించినప్పటికి దర్యాప్తులో ఇది అబద్ధమని తేలింది.
ఇదే సమయంలో జాంగ్ ఇప్పటి వరకు ఏడున్నర నెలలు జైలులో ఉన్నారు.అయితే నిషేధిత జోన్లోకి ప్రవేశించి.స్విమ్మింగ్ ఫూల్ ఉపయోగించేందుకే తాను రిసార్ట్లోకి వచ్చినట్లు ఫెడరల్ అధికారికి అబద్ధం చెప్పినందుకు జాంగ్ దోషిగా నిర్థారించబడింది.జైలు శిక్ష విధించే వరకు రిమాండ్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.
ఈ మధ్యలోనే చాంగ్ మరోసారి స్టోరీని మార్చేసింది.తానను ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో పాల్గొనేందుకే అక్కడికి వచ్చానని చెప్పింది.
ఫోర్ట్ లాడర్టేల్లోని ఫెడరల్ కోర్టు విచారణలో ఎట్టకేలకు తాను ట్రంప్, అతని కుటుంబసభ్యులను కలిసేందుకే వచ్చానని ఆమె నేరాన్ని అంగీకరించింది.