ఒక తెలుగు సినిమాలో వేణుమాధవ్ పెళ్లి కోసం చూస్తూ ఉంటాడు, అమెరికాలో పెద్ద జాబ్ అయినా కూడా ఆయనకు పెళ్లి కాదు.భారీ ఆస్తి, సంపాదన ఉన్నా కూడా అమ్మాయిలు అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించరు.
చివరకు ఎదురు కట్నం ఇస్తామని ఆఫర్ ఇచ్చినా కూడా చేసుకునేందుకు ఇష్టపడరు.ఇదే పరిస్థితి ప్రస్తుతం చైనాలో ఉంది.
చైనాలో చాలా సంవత్సరాలుగా జనాబా పెరుగుదల అడ్డుకునేందుకు ఏక సంతానం విధానంను అమలు చేస్తున్న విషయం తెల్సిందే.చైనాలో కొన్నాళ్ల క్రితం వరకు ఒక్కరి కంటే ఎక్కువ మందిని కంటే వారు ప్రభుత్వ పథకాలకు అనర్హులు.
అందుకే చైనాలో జనాబా కాస్త అదుపులోకి వచ్చింది.
చైనాలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి కారణంగా ఇప్పుడు అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు.
ఏక సంతానం నిర్ణయం వల్ల అంతా కూడా అబ్బాయిలు కావాలనుకునే వారు.అబ్బాయిల కోసం అబార్షన్లు కూడా చేయించారు.
అలా చైనాలో అబ్బాయిల శాతం భారీగా పెరిగింది.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అబ్బాయిలు 100 మంది ఉంటే అమ్మాయిలు 86 మంది ఉన్నారు.
అంటే 14 మంది అమ్మాయిల లోటు ఉంది.ఇదే సమయంలో చైనాలోని అమ్మాయిలు పూర్తిగా సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
మరి కొందరు పెళ్లిపై అసలు ఆసక్తి చూపడం లేదు.దాంతో అబ్బాయిలకు మరింతగా కష్టాలు ఎదురవుతున్నాయి.
చైనాలోని షాంఘై నగరంలో తాజాగా ఒక పార్క్లో అబ్బాయిలు లైన్గా నిల్చుని ఉన్నారు.వారి ముందు ఒక పేపర్పై వారికి సంబంధించిన సమాచారం ఉంది.రోడ్డుకు ఇరువైపుల పెళ్లి కాని అబ్బాయిలు తమ ప్రొఫైల్స్తో ఉంటే, రోడ్డు మద్యలో అమ్మాయి తల్లిదండ్రులు వెళ్తూ వారిని చూస్తూ వారి ప్రొఫైల్స్ను చూస్తూ ఎవరైనా నచ్చితే మాట్లాడుతున్నారు.ఇలాంటి పద్దతి చైనాలో చాలా రోజులుగా అమలు అవుతున్నాయి.
అబ్బాయిలు నడి రోడ్డుమీద నిలబడితే అమ్మాయిలు ఎంపిక చేసుకోవడం సినిమాల్లోనే అనుకుంటే చైనాలో నిజంగా జరుగుతుంది.ఇండియాలో కూడా అబ్బాయిల కోసం తెగ ఆరాట పడుతారు.
మన దేశంలో ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయయే 30, 40 ఏళ్లలో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టం అయ్యే ప్రమాదం ఉంది.అప్పుడు ఇండియన్ కుర్రాళ్లు కూడా రోడ్డు పక్కన నిల్చుని ఏ అమ్మాయి నన్ను నచ్చుతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.
అందుకే అమ్మాయిలను చిన్న చూపు చూసి చిన్నతనంలోనే చిదిమేయకండి.